calender_icon.png 6 May, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు..

06-05-2025 12:00:00 AM

కుత్బుల్లాపూర్, మే 5(విజయక్రాం తి): అతను ఇంటీరియర్ పనుల్లో నైపుణ్యత కలిగిన వృత్తి కళాకారుడు. వృత్తి తో పాటు ప్రవృత్తిగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేపడుతూ.. జల్సాలకు అలవాటు పడ్డాడు. రూ. రెండున్నర లక్షల బెక్, రూ. లక్షన్నర సెల్‌తో గం జాయి, డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తూ సొ మ్ము చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్‌బీ టీమ్ ఎస్సు బాలరాజు సిబ్బందితో కలిసి కుత్భుల్లాపూర్ శివారెడ్డినగర్‌లో దాడులు నిర్వ హించారు.

ఈ దాడిలో షరీఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 1.360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బెక్, సెల్‌ఫోన్, గంజాయిని ఎక్సుజ్ స్టేషన్‌లో అప్పగించామని ఎస్సు బాలరాజు తెలిపారు. ఈ కేసులో అఖిల్ అ నే వ్యక్తిపై కూడ కేసు నమోదు చేశారు.

మరో కేసులో ఎండీఎంఏ డ్రగ్స్ పట్టి వేత..

గొల్కోండ టీఎస్‌ఎస్ పీడీసీఎల్ మారుతి లంగర్ హౌజ్ ప్రాంతంలో హెడీఎఫ్‌బీ టీమ్ నిర్వహించిన దాడు ల్లో 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న మహ్మమద్ సులేమాన్‌ను ఆతడి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్, ఒక బెక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు.

ఈ కేసులో బెంగూళూరుకు చెందిన షకీల్‌పై కూడ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని, డ్రగ్స్‌ను గోల్కోండ ఎక్సుజ్ స్టేషన్‌లో అప్పగించామని తెలిపారు.