24-02-2026 01:00:05 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఫిబ్రవరి 23(విజయక్రాంతి): కెరమెరి మండలంలోని సావర్ ఖేడ్ గ్రామ శివారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ మధుకర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సావర్ఖేడ్ గ్రామ శివారులో వాహన తనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న సరోజిత్ మండల్ను తనిఖీ చేయగా,
అతని వద్ద నుంచి 210 గ్రాముల గంజాయి లభ్యమైంది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5,250 ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.గంజాయి విక్రయం, కొనుగోలు లేదా వినియోగంలో పాల్గొన్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.