calender_icon.png 25 June, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నగరంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్టు

25-06-2025 05:35:41 PM

హైదరాబాద్: బస్సులో ఏనుగు దంతాలు తరలిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటికి చెందిన నిందితుడు రేకులకుంట ప్రసాద్, లోకేశ్వర్ రెడ్డి అనే మరోవ్యక్తి తిరుపతి శేషాచలం అడవుల్లో సేకరించిన రెండు ఏనుగుల దంతాలను హైదరాబాద్ లో విక్రయించేందుకు బస్సులో తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ, ఫారెస్ట్ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 5.6 కిలోల రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకోగా, అంతర్జాతీయ మార్కెట్ లో దంతాల విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా.

పోలీసులను చూసి లోకేశ్వర్ రావు పరారీ కావడంతో అతని కోసం రాచకొండ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రసాద్ ను రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. రెండు ఏనుగు దంతాలు ఒరిజినల్ దంతాలా కాదా అని ఫారెస్ట్ వాళ్ళతో చెక్ చేయించినట్లు తెలిపారు. ఏనుగు నుంచి ఇవి కట్ చేసి సేకరించినట్లు వెల్లడించారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని రాచకొండ సీపీ పేర్కొన్నారు.