calender_icon.png 25 June, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్ములా ఈ రేస్ కేసు.. ఐఏఎస్ అరవింద్‌కు నోటీసులు

25-06-2025 06:04:26 PM

హైదరాబాద్: ఫార్ములా ఇ రేస్ కేసు(Formula E Race Case)లో అవినీతి నిరోధక బ్యూరో (Anti Corruption Bureau) అధికారులు దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ2గా ఉన్న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అధికారి అరవింద్ కుమార్‌(Senior IAS Officer Arvind Kumar)కు ఏసీబీ బుధవారం సమన్లు ​​జారీ చేసింది. ఫార్ములా ఇ రేస్ కేసుకు సంబంధించి జూలై 1న తమ ముందు హాజరు కావాలని ఏసీబీ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో జనవరిలో నే ఆయనను ఏసీబీ, ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే ఐదు నెలల సుధీర్ఘ విరామం తర్వాత జూన్ 16న కేటీఆర్ నే ఏసీబీ మరోసారి విచారించింది. 

ఈసారి ఇ రేస్ కేసులో బిజినెస్ రూల్స్, అగ్రిమెంట్ల, స్పాన్సర్లు, ఆర్థిక శాఖ అనుమతులు అనేక అంశాపై అధికారులకు కేటీఆర్ ఇచ్చి కీలక సమాచారం ఆధారంగానే అరవింద్ ను ప్రశ్నించబోతున్నట్లు సమాచారం. అవసరమైతే అరవింద్, కేటీఆర్ ను ఉమ్మడిగా విచారించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అరవింద్ విదేశాల్లో ఉన్నారు. ఈనెలాఖరు వరకు ఆయన తిరిగి తెలంగాణకు రానున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఇ రేస్‌కు సంబంధించిన అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు నిర్వహిస్తోంది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మాజీ మంత్రి కేటీఆర్, రిటైర్డ్ హెచ్ఎండీఏ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్‌ను నిందితుడిగా చేర్చారు. అప్పటి మంత్రి కేటీఆర్(KT Rama Rao) ఆదేశాల మేరకు తాను నిధులను బదిలీ చేశానని అరవింద్ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా తెలియజేశారు.