07-06-2025 11:20:05 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపాలనుకొని మరో మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన జిల్లాలోని మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి(Mailardevpally Police Station) కాటేదాన్ లో చోటుచేసుకుంది. తాగిన మైకంలో పక్కింటిలోకి వెళ్లి నిద్రిస్తున్న మహిళను వ్యక్తి కత్తితో పొడిచాడు. భార్యను చంపాలనుకుని మద్యం మత్తులో వ్యక్తి కత్తితో పక్కింటిలోకి వెళ్లాడు. కత్తితో పొడవడంతో మహిళ పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మహిళను పొడిచి పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తి కత్తితో దాడి చేయడంతో బాధితురాలి బంధువులు నిందితుడి కుటుంబంపై ఆగ్రహంతో ఉన్నారు.