07-06-2025 10:32:21 AM
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని (Medchal-Malkajgiri District) జగద్గరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి రింగ్ బస్తీలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు. మృతుడిని సాయి(35)గా గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా ఇంట్లో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను గమనించిన చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. వ్యక్తి సజీవదహనంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.