31-05-2025 12:41:08 AM
- నా చావుకు కారణం మా బావ కాంగ్రెస్ నాయకులు బండి యాదయ్య అని చేతిపై రాసుకొని ఆత్మహత్య
- మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఎం నాయకుల డిమాండ్
- గ్రామపంచాయతీ ఎదుట ధర్నా
యాచారం, మే 30:ఇందిరమ్మ ఇల్లు రా లేదని మనస్థాపానికి గురై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.. యా చారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (46) ఇందిరమ్మ ఇల్లు లిస్టులో పేరు రాలేదని మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా చావుకు కారణం మా బావ కాంగ్రెస్ నాయకులు బండి యాదయ్య అని చేతిపై రాసుకుని మృతి చెందాడు.
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. దొడ్డి అశోక్ కు టుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డి మాండ్ చేశారు.
ఆ కుటుంబానికి ఇంటి స్థ లం, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, భార్య రజిని, ముగ్గురు కూతుళ్లు లాహిరి, నికిత, సూక్ష్మ స్వరాజ్, వీరు ముగ్గురు చదువుకుంటున్నా రు. భార్యకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని, పిల్లలకు ఉచితంగా చదివించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ఏసిపి కెవిపిరాజు సహకారంతో.. మృతుని కుటుంబానికి యాచారం ఎంపీడీవో శైలజ, తాసిల్దా ర్ అయ్యప్ప ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలం, మంజూరు చేస్తామని, అదేవిధంగా రంగారెడ్డి డిఈవోతో పై చదువుల కోసం మాట్లాడ తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకే చెందాలని అధికారులకు తెలిపారు. భవిష్యత్తులో ఇ లాంటి ఘటనలు చోటు చేసుకోకూడదని, ప్రభుత్వాలతో కొట్లాడి, పోరాడి సాధించుకోవాలని నేతలు కోరారు.