calender_icon.png 1 June, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీధర్ బాబు బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ‘అల్ఫోర్స్‘ నరేందర్ రెడ్డి

31-05-2025 12:39:37 AM

కరీంనగర్, మే 30 (విజయ క్రాంతి): జి ల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో కరీంనగర్ జిల్లా బ్యా డ్మింటన్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన శ్రీధర్ బాబు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు, ఆ ల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ప్రారంభించారు.   

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మంథని ముద్దుబిడ్డ  ఐటీ, శాసనస భ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, కమ్యూనికేషన్ శాఖ మాత్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బా బు  పాత్ర విశిష్టమైనదని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేసుకొని ఎంతో మందికి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

ఆయన జన్మదినం సందర్భంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రా రంభించడం శుభ పరిణామమని, ప్రతి ఒక్క రూ క్రీడలలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుంటపల్లి స్వా మి, ప్రతినిధులు రమేష్, ముస్తఫా, నరేష్, బాబు శంకర్, మధుకర్, గంగరాజు, శివప్రసాద్, లక్ష్మణరావు, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.