07-01-2026 12:00:00 AM
మునుగోడు, జనవరి 6 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండలం పోర్లగడ్డతండా గ్రామానికి చెందిన వడ్య భాస్కర్ తండ్రి లచ్య వయసు 34 సంవత్సరాలు, కులం: లంబాడా, అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుండి మునుగోడు టౌన్ లోని చండూర్ రోడ్డు లో టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ అతని భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. హోటల్ వ్యాపారం సరిగా జరగక ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడి అప్పులు కావడంతో మనస్థాపనికి గురై సోమవారం రాత్రి అందరు నిద్రిస్తున్న సమయంలో మునుగోడు లోని అతను అద్దెకు తీసుకున్న నివాసంలో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోగా, మంగళవారం తెల్లవారుజామున 04:00 గంటలకు మృతిని భార్య, తండ్రి నిద్రలేచి చూసేసరికి అప్పటికే మరణించడంతో మృతిని తండ్రి లచ్య మునుగోడు పోలీస్ నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర ఇరుగు రవి తెలిపారు.