06-06-2025 10:18:42 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): భూముల్లో ఆయిల్ పామ్ పంటను పండించాలని తద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం కడెం మండల కేంద్రంలోని ఓ రైతు పంట పొలంలో పండించిన ఆయిల్ ఫామ్ మొదటి కోతను ఆయన కోశారు. ఉద్యాన పట్టు పరిశ్రమ ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఫైల్ ఫామ్ సాగు విధానం పట్ల అవగాహన కల్పించారు. రైతులందరూ ఆయిల్ ఫామ్ పంటను పండించాలన్నారు.