2 May, 2026 | 9:01 PM

Breaking News

25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

కారు ఢీకొని వ్యక్తి మృతి

02-05-2026 07:28 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల పరిధిలోని జింకలగూడెం క్రషర్ మిల్ వద్ద కారు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. బూర్గంపాడు అదనపు ఎస్ఐ నాగభిక్షం తెలిపిన వివరాల ప్రకారం... బూర్గంపాడు మండల పరిధిలోని అంజనాపురం గ్రామానికి చెందిన ధారవత్ కిషన్ శనివారం ఉదయం ఇంటి నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం మోరంపల్లి బంజరకు వెళ్తుండగా జింకలగూడెం క్రషర్ మిల్ వద్ద  భద్రాచలం వైపు వెళుతున్న ఓ కారు అతి వేగంతో వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే రోడ్డుపై పడి కిషన్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.మృతుడి కుమారుడు చంటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.