15 June, 2026 | 10:37 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

లోయర్ మానేరులో పడి వ్యక్తి మృతి

21-10-2024 12:04 AM

మానకొండూర్, అక్టోబరు 20: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలానికి చెందిన బూర సాయికుమార్(29) హైదరాబాద్‌లోని రామ్‌టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి ఇంటికి వస్తున్నానని చెప్పినా చేరలేదు. రాత్రి తిమ్మాపూర్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన సాయికుమార్ ప్రమాదవశాత్తు డ్యాంలో పడి మృతిచెందాడు. ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.