calender_icon.png 9 September, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంటలో తాబేళ్ల వేటకు వెళ్లి వ్యక్తి దుర్మరణం

09-09-2025 12:03:25 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కురవి మండలంలోని తిరుమలాపురం నల్లెల్ల శివారులోని గణేష్ కుంటలో తాబేళ్ల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బాజా వెంకన్న, భూతం వెంకన్న కలిసి తాబేళ్ల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు భూతం వెంకన్న కుంటలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని అతడి వెంట వెళ్లిన భాజా వెంకన్న సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది కుంటలో దిగి భూతం వెంకన్న ఆచూకీ కోసం రెండు రోజులుగా గాలింపు చేపట్టిన ఆచూకీ లభించలేదు. మంగళవారం తెల్లవారుజామున వెంకన్న మృతదేహం కుంటలో పైకి తేలడంతో ఒడ్డుకు తీసుకువచ్చి పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి  కురవి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.