22 June, 2026 | 3:22 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

తిరుపతిలో బీజేపీ నేత మారంపల్లి శ్రీనివాస్ మృతి

09-09-2025 11:25 AM

మెట్ పల్లి,:(విజయక్రాంతి): మెట్ పల్లి మండలం వెంపేట్ గ్రామానికి చెందిన మారంపల్లి శ్రీనివాస్(BJP leader Marepalli Srinivas) (52)తిరుపతి లో గుండె పోటుతో మృతి చెందినట్లు మంగళవారం బంధువులు తెలిపారు.బంధువుల కథనం శ్రీనివాస్ తన మిత్రులతో కలిసి సోమవారం తిరుపతి దర్శనం కోసం బయలు దేరివెళ్లారు.రాత్రి కి తిరుపతికి చేరుకొని అక్కడే గది తీసుకోని ఉన్నారు. మంగళవారం వారి దర్శనం ఉండగా సోమవారం రాత్రి గుండె పోటు వచ్చి మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతుడు శ్రీనివాస్ బీజేపీలో కీలక నేతగా ఉంటూ న్యాయవాది గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కూడా కొనసాగుతున్నాడు. శ్రీనివాస్ కు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉండగా, ఆయన మృతితో గ్రామం లో విశద ఛాయలు అలుముకున్నాయి.