20-06-2025 09:02:43 PM
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని బుట్టయిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమాన కోర్ట్ విధించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గతంలో 2022 నవంబర్ లో వృద్దురాలు ఐన తల్లి కుమ్మరి ఎర్ర మల్లక్క బాగోగులు, పోషణ విషయంలో కుమారులైన అన్న కుమ్మరి దుర్గయ్య, తమ్ముడు చిన్న వెంకటయ్య మధ్య గొడవ జరిగి, చిన్న వెంకటయ్య, దుర్గయ్యను కొట్టడంతో దుర్గయ్య మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.
దుర్గయ్య భార్య ఐన మణిక్యమ్మ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ సురేష్ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేయ్యగా, నిన్న కోర్ట్ నుండి చిన్న వెంకటయ్యకు 3 నెలల జైలు శిక్ష, 5 వేల జరిమానా విధించారు. శిక్ష పడటంలో I. O. సురేష్, కన్నాయిగూడెం ఎస్ఐ వెంకటేష్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ ప్రసాద్ కోర్ట్ కానిస్టేబుల్ కె. మౌనిక లు తమ విధులలో ప్రతిభ చూపారు.