20-06-2025 09:37:43 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం యూరియా ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాశారు. యూరియా ఎరువు వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం నుంచే సింగిల్ విండో వద్దకు వచ్చి బారులు తీరారు. అధికారులు సక్రమంగా పట్టించుకోకపోవడంతోనే యూరియా ఎరువుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి యూరియా ఎరువు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.