03-08-2025 04:46:45 PM
ముసి ఉన్న బెల్లంపల్లి పెద్ద ఆసుపత్రి
ఇంటికెళ్లిన నర్సులు, వైద్యులు
వైద్యోనారాయణ తీరుఇదేనా
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా ప్రభుత్వ పెద్ద ఆస్పత్రి కి తాళం పడింది. ఆదివారం అత్యవసర వైద్య సేవలు, ఇన్ పేషంట్ల కోసం వైద్యులు, వైద్య సిబ్బంది విధుల్లో ఉండాలి. కానీ ఆదివారం అని వీకెండ్ సెలవు తీసుకున్నట్టుగా ఆస్పత్రి మూసి ఉంది. ఆస్పత్రిని మూసి వేసి వైద్యులు నర్సులు వెళ్లిపోయారు. మధ్యాహ్నం నాలుగు దాటిన వైద్య సిబ్బంది ఎవరు ఆస్పత్రికిరాలేదు. ఆసుపత్రి మూసి ఉండడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు తిరిగి వెళ్లారు. మరికొందరు వచ్చి అక్కడే వైద్యుల కోసం పడి కాపులు కాసిన పరిస్థితి నెలకొంది.
ఉదయం విధులకు హాజరైన వైద్యులు, వైద్య సిబ్బంది 12 తర్వాత వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రి ప్రధాన ద్వారం తలుపులు మూసిఉన్నాయి. అత్యవసర విభాగం ఆసుపత్రి మూసి ఉండడం ఒకింత అధ్యంతం ఆశ్చర్యాన్నీ కలిగిస్తోంది. ఆస్పత్రి ప్రధాన ద్వారం మూసి ఉండగా వెనకవైపు ఒక డోర్ మాత్రమే ఓపెన్ చేసి ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వ వైద్యశాల మూసి ఉండకూడదు. అత్యవసర వైద్య సేవలకు ఆస్పత్రి ఎల్లవేళ ఓపెన్ గానే ఉండాలి. అంతకు భిన్నంగా ప్రధాన ఆసుపత్రి మూసి వేసి ఉండడం ఏంటన్నది అంతు చిక్కడం లేదు. వైద్యులు, నర్సులు అత్యవసర సేవలను విస్మరించి, ఇన్ పేషెంట్ల పర్యవేక్షణ ను సైతం గాలికి వదిలేసి వెళ్లిపోయారు.
ఆసుపత్రి మూసి ఉంచడం పై ఇన్ పేషెంట్లు, అవుట్ పేషంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసి ఉన్న సమయంలో వైద్యం కోసం అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా పేషంట్లూ వస్తే వారి పరిస్థితి ఏంటన్నది ఆందోళన రేకెత్తించే విషయం. వైద్యో నారాయణ అంటే ఇదేనా? అని వైద్యుల తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా బాధ్యత రాహిత్యంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆస్పత్రిని మూసివేసి బయటికి వెళ్లడం పై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.