4 July, 2026 | 9:16 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

సజ్జలకు నోటీసులు

16-10-2024 03:27 PM

అమరావతి,(విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి బుధవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2021 అక్టోబర్ 19న వైసీపీ పార్టీకి చెందిన కొందరు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి ఫర్మిచర్, కార్లు, అద్దాలు ధ్వంసం చేసి వీరంగం సృష్ట్రించారు. ఈ ఘటనపై పలువురు వైసీపీ నేతలను పోలీసులు విచారించగా.. ఈ కేసులో సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో కీలక నింధింతుడైన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సన్నిహితుడు చైతన్య సోమవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు.