08-02-2026 12:20:15 AM
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో 31 మంది, సుక్మా జిల్లాలో 21 మంది సరెండర్
చర్ల, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో శనివారం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా లో 30 మంది లొంగిపోయారు. వారిలో 20 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. సుక్మా జిల్లాలో 21 మంది ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరి లో ఏడుగురు పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ఈ 21 మందిపై రూ.76 లక్షల రివార్డ్ ఉంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున తక్షణ సాయం అందించింది.