26 May, 2026 | 4:22 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

51 మంది మావోయిస్టుల లొంగుబాటు

08-02-2026 12:20 AM

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో 31 మంది, సుక్మా జిల్లాలో 21 మంది  సరెండర్

చర్ల, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా లో 30 మంది లొంగిపోయారు. వారిలో 20 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. సుక్మా జిల్లాలో 21 మంది ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరి లో ఏడుగురు పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ఈ 21 మందిపై రూ.76 లక్షల రివార్డ్ ఉంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున తక్షణ సాయం అందించింది.