calender_icon.png 2 June, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల ఎదుట లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు

31-05-2025 04:46:17 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నిషేధిత మావోయిస్టులు(Maoists) ఎనిమిది మంది శనివారం ములుగు పోలీసుల(Mulugu Police) ముందు లొంగిపోయారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లకు చెందిన ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు (DVCM), ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు (ACM) సహా ఎనిమిది మంది మావోయిస్టులు ఆయుధాలు వదులుకుని ములుగు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శబరీష్(Mulugu District SP Dr. Shabarish) ఎదుట లొంగిపోయారని అధికారిక తెలియజేశారు. ఈ ఏడాది జనవరి నుంచి తెలంగాణ పోలీసుల ముందు 355 మంది మావోయిస్టులు లొంగిపోయారని, అందులో 68 మంది ములుగు జిల్లా పోలీసుల ముందు ఉన్నారన్నారు. 

లొంగిపోయిన మావోయిస్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్న తర్వాత వారు నక్సలిజం మార్గాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని పోలీసుల ముందు లొంగిపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో నిషేధిత సిపిఐ (మావోయిస్టులు) సాయుధంగా కదులుతున్నారని, సరిహద్దు గ్రామాల ప్రజలు అల్ట్రాస్ తో సహకరించవద్దని, మావోయిస్టుల కదలికలను గమనించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ సూచించారు.