calender_icon.png 2 June, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల మూడవ దశ వృత్యంతర శిక్షణ

31-05-2025 08:21:23 PM

కరీంనగర్,(విజయక్రాంతి): ఉపాధ్యాయులు సమాజాభివృద్ధికి మూలమని,  వారు పోషించే పాత్ర చాలా విశిష్టమైనదని కరీంనగర్ జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య అల్ఫోర్స్ విద్యా సంస్థలు అధినేత & వ్యవస్థాపకులు, వీఎన్ఆర్ ఫౌండేషన్ డా. వి.నరేందర్ రెడ్డి, కోర్స్ సమన్వయకర్త అశోక్ రెడ్డి జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి  ఇతర అధికారులతో కలిసి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో గత ఐదు రోజులుగా నిర్వహింపబడుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు సమాజంలో వెలవడుతున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం అన్ని విషయాలను నేర్చుకోవడమే కాకుండా వాటిని విశ్లేషణాత్మకంగా సమగ్రంగా అమలుపరిచి విద్యార్థుల సర్వతోముభివృద్ధికై కృషి చేయాలని వారు చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఉపాధ్యాయుల అభివృద్ధికై అనేక నిధులను కేటాయిస్తూ పాఠశాలలో ఈ అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకోవాలని మరియు జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎటువంటి లోటు లేకుండా గత మూడు దఫాలలో ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు అన్ని రకాలుగా తోడ్పాటు అందించడంతో పాటు కరీంనగర్ జిల్లా పరిపాలన అధికారి గౌరవనీయులు పామెల సత్పతి గారి ప్రోత్సాహంతో నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చాలా జయప్రదంగా నిర్వహించుకోవడం హర్షించదగ్గ విషయమని చెప్పారు‌

ప్రతి ఉపాధ్యాయుడు సమాజంలో వెలవడుతున్న మార్పులకు అనుగుణంగా విషయాలు నేర్చుకొని వాటిని చక్కగా అమలు పరచడమే కాకుండా వాటిలోని విషయాలను విద్యార్థులకు తుచ తప్పకుండా సముచితంగా తెలపాలని సూచించారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పామెల సత్పత్తి గారి సారథ్యంలో నెలరోజులుగా అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తూ  మూడు దశల్లో విజయవంతంగా పూర్తి  చేశామని చెప్పారు. ఉపాధ్యాయులు సమాజంలో అనేక మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని మరియు నేటి పోటీ ప్రపంచంలో వారి యొక్క పాత్ర ఎనలేనిదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని తెలుపుతూ ప్రతి ఒక్కరూ మార్పులు గ్రహించి చక్కటి ప్రణాళికలతో విజయ పధాన పయనించాలని కోరారు. 

ఉపాధ్యాయలను మాత్రమే విద్యార్థులు ఆదర్శంగా తీసుకుంటారని ఉపాధ్యాయులందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ నవసమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంజ రెడ్డి గారు, భగవంత రావు గారు, ఆంజనేయులు గారు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు‌. ఐదు రోజుల శిక్షణలో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు మరియు మూడో దశల్లో విజయవంతంగా అన్ని వసతులు కల్పించి ఎటువంటి లోటు లేకుండా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు విద్యా సంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి గారిని జిల్లా విద్యాశాఖ వారు ఘనంగా సన్మానించారు.