వ్యక్తి గొంతుకోసి హతమార్చిన మావోయిస్టులు

28-04-2024 01:17:59 AM

చర్ల, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): చర్ల మండలానికి సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా దంతెవాడలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశాడనే కారణంతో జోగ పొడియామి అనే వ్యక్తిని మావోయిస్టులు శనివారం గొంతుకోసి హత్య చేశారు. మావోయిస్టులు కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను సమూలంగా అంతం చేస్తామని ప్రకటించిన నాటి నుంచి సుమారు 200 మందికి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. దీనికి బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గతంలోనే మావోయిస్టులు హెచ్చరించిన విషయం తెలిసిందే.