12-06-2025 01:12:49 AM
నేడు బాధ్యతల స్వీకరణ!
వాకిటి శ్రీహరి : పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖలు
అడ్లూరి లక్ష్మణ్ : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు
గడ్డం వివేక్ : మైనింగ్, కార్మిక శాఖలు
హైదరాబాద్, జూన్ ౧౧ (విజయక్రాంతి): కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు జీఏడీ కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురికి శాఖల ను కేటాయించింది. గడ్డం వివేక్ వెంకటస్వామికి మైనింగ్, కార్మిక శాఖలను, అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధకం, క్రీడలు, యువజన శాఖ లను కేటాయించారు.
శాఖల కేటాయింపు జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులు నేడు బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా సమాచారం. ఈ మేరకు సెక్రటే రియట్లోని వారి చాంబర్లను సాధారణ పరిపాలన శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించారు. మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో ఎలాంటి మార్పు చేయలేదు.