15-06-2025 12:33:29 AM
ఖానాపూర్ (విజయక్రాంతి): అత్తగారి ఇంట్లో వేధింపులు తట్టుకోలేక వివాహిత శైలజ(20) ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం... మూడు నెలల క్రితం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన దండుగుల నరసవ్వ, పోచన్న దంపతుల కూతురు శైలజను అదే గ్రామానికి చెందిన అల్లెపు రాజేష్ కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి అయినా రెండు నెలల నుంచి శైలజను తన భర్త రాజేష్, అత్త లక్ష్మి రోజు వరకట్నం తేవాలని, లేకుంటే వెళ్లిపోవాలని వేధించడం మొదలు పెట్టారని తల్లిదండ్రులకు మృతురాలు వివరించిందని బంధువులు తెలిపారు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.