11 August, 2026 | 1:36 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు

11-08-2026 12:32 PM

చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని లింగంపేట గ్రామం నుండి  సనుగుల, రామారావు పల్లె, కిష్టంపేట, గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షాలకే రోడ్లపై గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. లింగంపేట గ్రామం నుండి సనుగుల ప్రధాన రహదారిపై వర్షపు నీళ్లు, పొలం, ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు రోడ్డుపైకి చేరుకోవడంతో గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమయాల్లో వాహనదారులకు అలాగే రైతులు, కాలి నడక నడిచే వారికీ ఇబ్బంది అవుతుంది, రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి దాపురించింది.ఇప్పటికైనా అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి రహదారి మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.