గద్వాలలో భారీ చోరీ
గద్వాల (వనపర్తి), జూన్ 21 (విజయక్రాంతి): గద్వాలలోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దుండగులు బంగారు ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. శుక్రవారం ఘటన వెలుగు చూసింది. పట్టణ ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వ్యాపారి ప్రతాప్ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఏపీలోని కర్నూలుకు వెళ్లాడు. తర్వాత గుర్తుతెలియని ఇంట్లోకి ప్రవేశించి బంగారంతో పాటు నగదు అపహరించి ఉడాయించారు. సాయంత్రం ఇంటి మెయిన్ గేట్ తెరిచి ఉండటాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు ప్రతాప్కు సమాచారం ఇచ్చారు. ప్రతాప్ ఇంటికి వచ్చి చూసి 30 తులాల బంగారం, రూ.3.50 లక్షలు నగదు అపహరణకు గురైందని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
పోలీసుల నిర్లక్ష్యంతోనే చోరీలు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే గద్వాలలో జోరుగా చోరీలు జరుగుతున్నాయనిఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రానికి చెందిన వ్యాపారి ప్రతాప్ ఇంట్లో చోరీ జరిగిందని తెలుసుకుని వెంటనే ఆయన బాధితుడి ఇంటిని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధితుడు గురు వారం రాత్రి పోలీసులు ఆశ్రయించినప్పటికీ, శుక్రవారం ఉదయం వరకు ఘటనా స్థలానికి రాకపోవడం సరికాదన్నారు. చోరీలను అరికట్టడంలో పోలీసులు విఫలమవు తున్నారన్నారు. అనంతరం పోలీసులకు కాల్ చేసి చోరీలను అరికట్టాలని, ప్రతాప్ ఇంట్లో చోరీ కేసు పురోగతిపై ఆరా తీశారు.






