8 June, 2026 | 7:40 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మౌలానా అబుల్ కలాం కృషి

12-11-2025 12:52 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, నవంబర్ 11 (విజయక్రాంతి) :  విద్య ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కృషి చేశారని జిల్లా కలెక్టర్ తేజేస్ నంద్ లాల్  పవార్ అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137 వ జయంతి సందర్భంగా మంగళవారం  కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో  ఏర్పాటుచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.   

జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ ,పలువురు మైనార్టీ పెద్దలు కలీం అహ్మద్,అబూబాకర్ సిద్ధికి, అంజద్ అలీ, మత పెద్ద అక్తర్ మౌలానా, తెలంగాణ మైనారిటీస్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షేక్ బడే సాబ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శంకర్, డి టి ఓ రవి కుమార్, డి డబ్ల్యూ ఓ నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.