27-05-2025 04:37:02 PM
బీసీ జేఏసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు జానయ్య యాదవ్..
తుంగతుర్తి (విజయక్రాంతి): సౌడమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ యాదవ కులస్తులపై ఉండాలని బీసీ జేఏసీ సంక్షేమ సంఘం(BC JAC Welfare Association) రాష్ట్ర నాయకులు వట్టి జానయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం జరిగిన సౌడమ్మ తల్లి జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట, కుంభం వెంకన్న యాదవ్, ఆవుల అంజయ్య యాదవ్, సంపత్, లింగాల సైదులు, సురేష్, లింగమల్లు, నాగమల్లు, మామిడి ఉదయ్, ఎర్పుల రాజు, గణేష్ తదితరులు ఉన్నారు.