11-01-2025 12:00:00 AM
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
ఒకరినొకరు కాపాడుకుందాం, సంపదను అందరం కలిసి అనుభవిద్దాం. సాహసాలూ కలిసే చేద్దాం, తేజోవంతులమవుదాం, ద్వేషా లు వదిలేయడం శాంతికి దారి. భగవంతుని అందడం, ఆయన కళ్యాణ గుణాలను అనుభవించడమే వ్రతఫలం. సాకేతం అంటే వైకుం ఠం. గోపికలు అడిగిన వస్తువులు భౌతికమైనవి కావు. సామాన్యమైనవి కావు. సాక్షా త్తూ వాసుదేవుడు ధరించే శంఖచక్రాలు అంటే శంఖచక్ర ధరుడైన వాసుదేవునే వారు కోరుతున్నారు.
శంఖచక్రాలతోపాటు గరుడధ్వజం, పారతంత్య్రమనే పఱై కోరుతూ మంగళా శాసనాలు చేసేవారు, మహాలక్ష్మి వంటి మంగళదీపాన్ని కావాలంటున్నారు. చాందినీ, ఆసనం, పడక అని రకరకాలుగా అమరే ఆదిశేషుని కోరుకుంటున్నారు. ఇవి సామాన్యులకు అమరేవి కావు. అమరులకు కూడా దొరకవు. అంటే అవన్నీ నిరంతరం కలిగి ఉండే వాసుదేవుడే వారికి కావాలని అర్థం. వాసుదేవుడే దుర్లభుడు.
వారి అంతరంగం తననే కోరుకుంటు న్నదని వాసుదేవుడు గమనించాడు. కూడారై= తనను కూడని వారిని సైతం, వెల్లుమ్= జయించే, శీర్= కళ్యాణగుణ సమన్వితుడైన, గోవిందా= గోవింద నామధేయుడా, ఉన్ఱనై= నిన్ను, ప్పా డి= కీర్తించి, పఱైకొండు= పర అనే వాయిద్యా న్ని కోరి, యామ్= మేము, పెరు= పెద్ద లేదా పొందెడి, శమ్మానమ్= సన్మానమును, నాడు= లోకమంతయు, పుగళం పరిశినాళ్= మెచ్చుకునే రీతిలో, నన్ఱాకబ శూడగమే= చేతికి ఆభరణాలు, తోళ్ వళైయే= భుజకీర్తులు, తోడే= కర్ణాభరణాలైన దుద్దులు, శెవి ప్పూవే= చెవికి ధరించే పూవులు, పాడకమే= పాదాభరణాలు, యెన్ఱనైయ= అని పిలువబడే, పల్కల నుమ్= అనేక రకాల ఆభరణా లను,
యామ్= మేము, అణివోమ్= ధరింతుముగాక, ఆడై= వస్త్రములను, ఉడుప్పోం= ధరింతుముగాక, అదన్ పిన్నే= దాని తరువాత, పాల్ శోఱు= పాలతో చేసిన అన్నం, పరమాన్నం, మూడ= నెయ్ పెయ్దు= నేయి పోసి, ముళంగై= మోచేతి నుంచి, వళివార= కారునట్లుగా, కూడి ఇరుందు= నీతో కలిసి వుండి, కుళిరుంద= ఆరగించడమే-, ఏలోర్ ఎంబా వాయ్= మా వ్రతం.
కలిసిరాని శత్రువులను జయించడమనే కళ్యాణగుణ సంపదగల గోవిందుడా! నిను కీర్తించి, ఈ తిరుప్పావై వ్రత సాధనమైన పఱై అనే వాయిద్యాన్ని పొందిన, పొందదలిచిన, ఘనసన్మానం లోకులంతా మెచ్చుకునేట్టు ఉంటుంది. చేతులకు గాజులు, భుజాలకు కడియాలు, చెవికింద దుద్దులు, పైన చెవిపూలు, కాలికి అందెలు వంటి అనేకాభరణాలు ధరించాలి. పిదప మంచిచీరలు కట్టుకోవాలి. తరువాత పాలు అన్నం మునిగేట్టు నేయి పోయాలి.
ఆ తీపి పరమాన్నాన్ని మోచేతి వెంట కారునట్టుగా దోసిట్లో పోసుకుని జుర్రుకోవాలి. అదీ నీతో కూచుని హాయి గా భుజించాలి. ఇదే మా వ్రత ఫలం గోవిందా అంటున్నది గోదమ్మ. భగవంతుని అందడం, ఆయన కళ్యాణ గుణాలను అనుభవించడమే వ్రత ఫలం. పరమా న్నాన్ని పరమాత్ముడితో కలిసి అనుభవించడమే పరమానందం. పరమానందమే మోక్షం. అదే కూడారై.
నా వంటి అధముడు, తప్పులు చేసిన వాడు, అపవిత్రుడు నీ పరిజనంలో ఉండాలని కోరుకోవడం అందుకు ‘నేను తగిన వాడనా’ అని యమునాచార్యులు ప్రార్థించారట. తమ తక్కువతనం చూపి భగవంతుని స్పర్శ లేనిదే బతకలేమని చెప్పి దివ్య మంగళ విగ్రహ సౌందర్యారాధన చేయాలి. తనపై అలిగిన ప్రేయసులను, గోపికలను, తాత్కాలికంగా విముఖులైన వారిని కూడా దారికి తెచ్చుకుంటాడు కృష్ణుడు.
ద్వేషంతో విముఖులైన వారిని పరాక్రమంతో జయిస్తాడు. ఉదాసీనంగా విముఖులైన వారిని కూడా అనుస రించి తన సౌందర్యంతో ఆకర్షిస్తాడు. నీతో ఉండతగమని విముఖులయ్యే వారు, ప్రణయకోపంతో విముఖుల య్యే వారు అలిగే వారు, స్నేహమూ లేక ద్వేష మూ లేక విముఖులయ్యే వారు, ద్వేషంతో విముఖులయ్యే వారు అందరినీ ఏదో మార్గం ద్వారా జయిస్తాడు.