15 June, 2026 | 5:46 PM

గోల్కొండలో యూట్యూబర్ హత్య కేసును చేధించిన పోలీసులు

15-06-2026 04:56 PM

హైదరాబాద్: గోల్కొండలో యూట్యూబర్(YouTuber) హత్య కేసును పోలీసులు చేధించారు. మసూద్ చాందీ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నలుగురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రేమ వివాహమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. బావమరిది, బంధువుల దాడిలో మసూద్ చాంధీ మృతి చెందింది. ఇనుప రాడ్లు, కత్తులతో ఇంట్లోకి చొరబడి మసూద్  పై దాడి చేశారు. దాడి ఘటనలో మసూద్ తండ్రికి గాయాలయ్యాయి. నిందితుల నుంచి కత్తి, ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.