25-06-2025 01:43:50 AM
మాజీ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఏ వేదిక మీదనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీమంత్రి హారీశ్రావు మంగళవారం ఎక్స్లో ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే ఎటూ పాలుపోక సీఎం రేవంత్ ప్రతి రోజూ అబద్ధాలతో నెట్టుకోస్తున్నారని పేర్కొన్నరు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రె స్ గెలుపుపై భరోసా లేక రైతుభరోసా వేశారని ఆరోపించారు. వ్యవసాయాన్ని పండగ లా చేసిన కేసీఆర్ను ఉరి తీయాలని ఉన్మాది లా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎడారిగా మారి తే ధాన్యం ఉత్పత్తిలో రాష్ర్టం దేశంలో నెంబ ర్ వన్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. హామీల గురించి ప్రశ్నిస్తున్నందుకు తమపై బూతులతో చెలరేగుతు న్నా తాము సంయమనాన్ని కోల్పోమని చెప్పారు.