21 April, 2026 | 5:54 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్

21-04-2026 04:45 PM

కారేపల్లి,(విజయక్రాంతి): భాగ్యనగర్ తండా గ్రామపంచాయతిలో వేసవి కాలంలో గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యమని భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్ తెలిపారు. గ్రామంలోని 5వ వార్డులో ఏర్పాటు చేసిన మంచినీటి బోర్‌కు మోటార్ అమర్చించి, తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరాలాల్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే పక్షులు, ఇతర జీవుల కోసం కూడా నీటి పాత్రలు ఏర్పాటు చేయాలని కోరారు.