దుబాయ్: ఆసియా అండర్ అథ్లెటిక్స్ మీట్లో భారత్ పతకాల సంఖ్య 15కు చేరింది. ఇందులో 5 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత అథ్లెట్లు లక్షిత వినోద్ మహిళల 800 మీటర్ల విభాగంలో రజతం నెగ్గగా.. మహిళల 400 మీటర్ల హార్డిల్స్ విభాగంలో శ్రీయా రాజేశ్ కాంస్యం గెలుచుకుంది. ఇక మహిళల 100 మీటర్ల హార్డిల్స్ విభాగంలో సబితా, ఉన్నతి అయ్యప్పలు మెడల్ రౌండ్కు అర్హత సాధించారు. అలాగే పురుషుల 4x100 మీటర్ల రిలే విభాగంలోనూ భారత అథ్లెట్ బృందం మెడల్ రౌండ్కు క్వాలిఫై అయ్యింది. దీంతో టోర్నీ ముగిసేలోపు భారత్కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశముంది.