03-02-2026 01:37:32 AM
టీటీడీ కళ్యాణ మండపానికి తరలింపు భారీ బందోబస్తు నడుమ ఆర్టీసీ కార్గో వాహనాల్లో..
మేడారం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మేడారంలో ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం హనుమకొండకు తరలించారు. జనవరి 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణం లో ఏర్పాటుచేసిన హుండీలను హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి తరలించారు.
సమ్మక్క గద్దె వద్ద ఏర్పాటుచేసిన 294 హుండీలు, సారలమ్మ గద్దె వద్ద ఏర్పాటు చేసిన 294 హుండీలు, పగిడిద్దరాజు గద్దె వద్ద ఏర్పాటు చేసిన 76, గోవిందరాజు గద్దె వద్ద ఏర్పాటు చేసిన 76, 45 క్లాత్ హుండీలను భారీ బందోబస్తుతో ఆర్టీసీ కార్గో వాహనాల్లో తరలించారు.