22-06-2025 08:46:17 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): సత్య సాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) పెనుగొండ గ్రామంలో శ్రీ సాయి జనని 9వ ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందకిషోర్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు వైద్య పరీక్షల నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు తవిసి ఉపేందర్, జింజిరాల సోమేశ్వర్, మాధవరపు ప్రదీప్, కొల్లూరు శ్రీనివాస్, మెడికల్ కోఆర్డినేటర్ పురుషోత్తం, తొట్ల సారంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.