23 March, 2026 | 11:42 PM

విద్యార్థులకు ప్రగతి పత్రాలను అందజేసిన ఎంఈఓ

23-04-2025 08:15 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాకలోని లెనిన్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రగతి పత్రాలను ఎంఈఓ యదు సింహరాజు చేతుల మీదుగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల యొక్క ఆవశ్యకతను గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి.రమేష్, ఉపాధ్యాయురాలు డి.హేమలక్ష్మి, తల్లిదండ్రులు రాఘవ, రఫీక్, పాషా, బీనా, లక్ష్మి, అనూష తదితరులు పాల్గొన్నారు.