24 June, 2026 | 2:30 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

25-10-2025 12:00 AM

జిన్నారం, అక్టోబర్ 24 : జిన్నారం మండ లం గడ్డపోతారం మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేయడంపై కాం గ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం వార్డు కార్యాలయం ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజుగౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రాజు గౌడ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కాం గ్రెస్ పాలలోనే సాధ్యమని అన్నారు. రూ.15 కోట్ల నిధులతో మున్సిపాలిటీ మరింత అభివృద్ధిని సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్ర మంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.