calender_icon.png 20 February, 2026 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి చిత్ర పటానికి క్షీరాభిషేకం

20-02-2026 02:08:09 AM

చిన్నంబావి, ఫిబ్రవరి 19:మండల కేంద్రంలోని వాల్మీకి చౌరస్తాలో మండల వాల్మీకి నాయకులు గురువారంరాష్ట ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.కొల్లాపూర్ లోఇటీవల జరిగిన మున్సిపాల్టీ ఎన్నికల్లో కౌన్సిలర్ విజయం సాధించిన వాల్మీకి బిడ్డ రెడ్డి సత్యం జ్యోతికి మున్సిపాలిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించిన సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావుకు మండల వాల్మీకి సంఘం అధ్యక్షుడు ఉమేష్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి బోయలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నారని,ఇతర పార్టీలు మెజార్టీ వర్గాలను రాజకీయ ప్రతినిధుల కంటే ఓటు బ్యాంకుగా చూస్తున్న తరుణంలో మంత్రి ప్రత్యేక చొరవతో అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తాలూకా వాల్మీకి సంఘం అధ్యక్షుడు పి.రాజ్ కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగారి శ్రీను,సుధాకర్ నాయుడు, గువ్వల రామకృష్ణ,శివ నాయుడు, రమేష్, గోవింద్, సురేష్,ఆంజనేయులు,శివకాంత్ తదితరులు పాల్గొన్నారు.