20-02-2026 02:07:01 AM
అలంపూర్ ఫిబ్రవరి 19 నిరుపేదలకు సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారమవుతుందని నాయకులు బేక్కేసుల శ్రీకాంత్ అన్నారు.గురువారం ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామంలో సత్యమ్మ, హసీనా, సుంకులమ్మకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు.కాగా లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన పత్రాలతో పాటు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుందని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, రామాంజనేయులు ,మహేష్ రాజు, వెంకటేశు ,రాజశేఖర్ ,బాబు భాషా తదితరులు పాల్గొన్నారు.