calender_icon.png 26 June, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వారీలను తనిఖీ చేసిన మైనింగ్ అధికారి

26-06-2025 06:44:13 PM

మేడ్చల్ అర్బన్: క్వారీల ఇష్టారీతి బ్లాస్టింగ్ వల్ల తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని బండమాదరం గ్రామస్తులు వాపోతున్నారు. మేడ్చల్ మండల(Medchal Mandal) రెవెన్యూ పరిధి గిర్మాపూర్, రాయిలాపూర్, బండ మాదారం గ్రామాలలో ఉన్నటువంటి క్వారీల వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గురువారం జిల్లా మైనింగ్ అధికారి సైదులు, కాలుష్య నియంత్రణ అధికారిని స్వప్న క్రషర్ మిషన్ల వద్ద పరిస్థితిని తనిఖీ చేశారు. క్వారీల ఇష్టారీతి బ్లాస్టింగ్ వల్ల గ్రామంలోని తమ ఇండ్లకు పర్రెలు వాసి కూలిపోయే దుస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు ఆరోపించారు. క్రషర్ మిషన్ల ద్వారా వస్తున్న దుమ్ముతో తాము రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా తనిఖీలు చేసి సదరు క్వారీలపై ఎలాంటి చర్యలు తీసుకోరని గ్రామస్తుడు సత్యనారాయణ మండిపడ్డారు.