26-06-2025 06:46:31 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)ను గురువారం రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి(Former Minister Indrakaran Reddy) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు మాజీ మంత్రి స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించారు. జూపల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి జిల్లా సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీకాంత్ యాదవ్ ఉన్నారు.