మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి
- ప్రమాదాలు పునరావృతం కాకుండా
చర్యలు చేపట్టాలనీ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ
ధర్మపురి, ఏప్రిల్2 (విజయక్రాంతి)ధర్మపురి పట్టణ శివారులో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధర్మపురి పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న రాష్ట్రసాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను గురువారం పరామర్శించి ఓదార్చారు.
ప్రభుత్వం తరుపున అండగా ఉంటాం అధైర్య పడొద్ధoటూ మృతుల కుటుంబాలకు మంత్రి భరోసా కల్పించారు.ప్రమాదం జరిగిన తీరును ఆయన పోలీసులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులను ఆదేశించారు.ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఇతర బాధితులను సైతం ఆయన పరామర్శించారు.గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.




