రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
నారయణఖేడ్, ఏప్రిల్ 26 : డాక్టర్ బాబాసాహెచ్ అందించిన రాజ్యంగ రిజర్వేషన్ వల్లనే తాను ఈ స్థాయికి ఎదిగానని వైద్యారోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేటలో జనజాతర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ పార్టీ రాజ్యంగాన్ని మార్చే కుట్రను చేస్తుందన్నారు. దేశంలో 75ఏండ్లుగా రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాలకు అందించి వారి అభ్యున్నతికి కృషి చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ గడిల పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్షెట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం : ఎమ్మెల్యే సంజీవరెడ్డి
అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఖేడ్కు రూ. 50కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. బీబీ పాటిల్కు చేసిందేమిలేదుబీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ జహీరాబాద్ నియోజకవర్గానికి చేసిందేమిలేదని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ అన్నారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు నేషనల్ హైవే రోడ్డు తీసుకొచ్చానని, ఇందుకు పత్రాన్ని ఆయన బహిరంగ సభలో చూయించారు.