15 June, 2026 | 2:06 PM

Breaking News

తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •  

మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

13-06-2026 05:20 PM

చిట్యాల,(విజయక్రాంతి): తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిట్యాల పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబం అయినా కడారి లింగయ్య యాదవ్ మనవడు జాల శివచరణ్, మనవరాలు సాయిరాణి పరిస్థితిని తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. శనివారం ఈ విషయాన్ని చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

విద్యాభ్యాసం కొనసాగించేందుకు సాయిరాణికి ప్రైవేట్ కళాశాలలో సీటు ఇప్పించడంతో పాటు, కుటుంబ సభ్యులకు రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటానని, అనాథలుగా మారిన పిల్లల భవిష్యత్తు కోసం తన తరఫున అవసరమైన సహాయం అందిస్తానని అన్నారు. మంత్రి చూపిన ఉదారత, మానవత్వానికి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.