17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఆర్టీసీ కార్మికులతో సమాలోచనలకు సిద్ధంగా ఉన్నాం: మంత్రి పొన్నం

30-04-2025 07:20 PM

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నోటీసు(RTC Strike Notice)పై బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్టీసీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పునరాలోచించాలని కోరారు. ప్రస్తుతం సమ్మె చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్టీసీ లేదని, ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పోరాటం వల్లే రాష్ట్రం ఏర్పడిందని, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులతో సమాలోచనలకు తాను సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.