రాహుల్ సభ ఏర్పాట్ల పరిశీలన
04-05-2024 01:40 AM
ఆదిలాబాద్, మే 3 (విజయక్రాంతి): లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు ఆయా పార్టీల అగ్రనేతల రాకతో ప్రచారాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఈ నెల 5న నిర్మల్ జిల్లాకేంద్రానికి రానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పరిశీలించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ పలువురు నాయకులతో కలిసి శుక్రవారం సభ ప్రాంగణం ప్రాంతాన్ని పరిశీలించిన మం త్రి.. స్థానిక నాయకులకు పలు సూచనలు చేశారు. వేసవి కారణంగా ఎండల తీవ్రతతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల కాకుండా తగిన ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.




