గ్రామీణ ప్రాంతాలకు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు : మంత్రి శ్రీధర్ బాబు
01-07-2024 09:20 PM
హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మంత్రి శ్రీధర్ బాబును సచివాలయంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు సోమవారం కలిశారు. మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని, డేటా సెంటర్ కు సంబంధించిన సమస్యలపై తెలుసుకున్నారు. డేటా సెంటర్ పనులు 70 శాతం పూర్తయ్యాయని, 22 ఎకరాలకు సంబంధించి భూసేకరణ సమస్యలున్నాయని మంత్రి శ్రీధర్ బాబుకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు వివరించారు. భూసమస్యలను పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. సబ్ స్టేషన్లు, కాల్వల నిర్మాణం గడువులోపు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.






