31-05-2025 12:55:54 AM
ఉత్సాహంగా పండుగ వాతావరణంలో జరుపుకున్న నాయకులు.. కార్యకర్తలు
రక్తదానం, అన్నదానం, పండ్ల పంపిణీ, దేవాలయంలో, దర్గాలో, చర్చిలో ప్రార్థనలు
అన్ని కార్యక్రమాలలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, మే30(విజయక్రాంతి): రాష్ట్ర ఐటి,ఇండస్ట్రీస్ మరియు శాసనసభ వ్యవహారాలశాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మది న వేడుకలు ఘనంగా జరిగాయి.ఉదయం నుండి సాయంత్రం వరకు కార్యక్రమాలు కొనసాగాయి.శాతవాహన యూనివర్సిటీ ముందు ఉదయం ఆరుగంటలకే వాకర్స్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అన్ని కార్యక్రమాలలో సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
మాతాశిశు ఆసుపత్రిలో శ్రవణ్ నా యక్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చే శారు.మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దన్నాసింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కటింగ్ చేశారు.ఇందిరా చౌ క్ వద్ద కొట్టె ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఖా ర్ఖాన గడ్డ వృద్ధాశ్రమంలో సుమన్ గ్యాస్ట్రో హాస్పిటల్ ఆధ్వర్యలో పండ్ల పంపిణీ చేశారు, సివిల్ ఆసుపత్రిలో కిరణ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు.కోర్టు చౌరస్తా వద్ద పోతారం సురేందర్ ఆధ్వర్యం లో కేక్ కట్ చేశారు.కరీముల్లాషా దర్గాలో ఏండి తాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు క సిఎస్ఐ చర్చిలో కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులంతా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో యువజన కాంగ్రెస్ నా యకులు ఫహాద్,తాళ్లపల్లి శ్రీకాంత్,గుర్రం వా సు ఆధ్వర్యంలో పది మంది యువకులు రక్తదానం చేశారు.నాఖా చౌరస్తాలో సయ్యద్ ఖమ్రోద్దిన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి,సమద్ నవా బ్,చర్ల పద్మ,కర్ర రాజశేఖర్,కాంరెడ్డి రాంరె డ్డి, స్వామిగౌడ్,కాశెట్టి శ్రీనివాస్,పెద్ద సంఖ్య లో అన్ని డివిజన్ల,మండల కాంగ్రె స్ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.