31-05-2025 12:57:10 AM
- కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్, మే 30 (విజయక్రాంతి):ముందస్తుగా వచ్చిన నైరుతి రుతుపవనాలతో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని రైతులు ప్రారంభించిన వ్యవసాయ పనుల్లో లాబదాయక పంటలను వేసుకోవాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు.
శుక్రవారం నాగర్ కర్నూల్ మండలం దేశీ ఇటిక్యాల గ్రామంలో రైతు రమేష్ రెడ్డి పొలాన్ని సందర్శించి పత్తి విత్తనాలు నాటుతున్న తీ రును పరిశీలించారు. పంట దిగుబడి, విత్తనాల రకాలు, మందుల కొనుగోలు అంశాలను రైతుతో చర్చించారు.
లాభదాయక దిగుబడి సాధించాలంటే వ్యవసాయ శాఖ సూచనలతో పం టలు వేయాలాన్నారు. పత్తి పంటతోపాటు ఆయిల్ ఫామ్, హార్టికల్చర్ పంటల సాగుతో రైతులు ముందుకు రావాలని, వీటి కోసం ప్రభుత్వం సబ్సిడీ అందించడంతో పాటు కొనుగోలును కూ డా రైతు పొలాల వద్ద నుంచే చేస్తుందన్నారు.
కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖాఅధికారి చంద్రశేఖర్, ఏడి పూర్ణచంద్రారెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాజు, రైతులు కృష్ణారెడ్డి, బాల్రెడ్డి, నిరంజన్ తదితరులు ఉన్నారు.