calender_icon.png 1 June, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తన కొనుగోలు దారులకు రశీదు ఇవ్వాలి

31-05-2025 12:55:52 AM

కొత్తకోట మే 30 : కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం ఎరువుల దుకాణాల్లో ఏడిఏ దామోదర్ గౌడ్,  వ్యవసాయ అధికారి జాస్మిన్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్లు, పిసిలు,  ఇన్వాయిస్  లు పరిశీలించారు.

ప్రతి రైతు  విత్తన కొనుగోలు  చేసిన తర్వాత  రసీదు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వరి విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల లైసెన్స్లు  వాటి గడువు తేదీలను పరిశీలించారు. గడువు మించిన ఉత్పత్తులు ఎక్కడైనా ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించారు. ఉత్పత్తుల నాణ్యతపై కఠినమైన సూచనలు జారీ చేశారు.

తనిఖీల్లో ఇచ్చిన ముఖ్య సూచనలు చేస్తూ మాట్లాడారు. ఇన్పుట్ల అమ్మకాలపై తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలనీ,విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల స్టాక్ రిజిస్టర్లు పక్కాగా నిర్వహించాలనీ సూచిం చారు. స్టాక్ బోర్డు ప్రదర్శించాలి, నకిలీ విత్తనాల అమ్మకాన్ని కఠినంగా నివారించాలనీ ఆదేశించారు. గడువు మించిన ఉత్పత్తులు అమ్మకానికి ఉంచకూడదనీ ఒకవేళ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.